పొత్తు ఖరారు : బీఎస్పీ 38..ఎస్పీ 37 | Mayawati Akhilesh Yadav Seal Pact For Lok Sabha Poll | Sakshi
Sakshi News home page

పొత్తు ఖరారు : బీఎస్పీ 38, ఎస్పీ 37

Feb 21 2019 5:41 PM | Updated on Feb 21 2019 7:54 PM

Mayawati Akhilesh Yadav Seal Pact For Lok Sabha Poll - Sakshi

యూపీలో సీట్ల సర్ధుబాటును ప్రకటించిన ఎస్పీ-బీఎస్పీ

లక్నో : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తర్‌ ప్రదేశ్‌లో పొత్తును ఎస్పీ, బీఎస్పీలు గురువారం ఖరారు చేశాయి. యూపీలో మొత్తం 80 స్ధానాలకు గాను ఎస్పీ 37 స్ధానాల్లో, బీఎస్పీ 38 స్ధానాల్లో పోటీ చేసేలా అంగీకారం కుదిరింది. ఈ మేరకు తాము పోటీ చేసే స్ధానాలను వెల్లడిస్తూ ఇరు పార్టీలు జాబితాను విడుదల చేశాయి. అమేథి, రాయ్‌బరేలిలో అభ్యర్ధులను ప్రకటించబోమని ఎస్పీ, బిఎస్పీలు ఇప్పటికే ప్రకటించగా, మిగిలిన మూడు స్ధానాల్లో అజిత్‌ సింగ్‌ నేతృత్వంలోని ఆర్‌ఎల్డీ పోటీచేస్తుంది.

ఇక ఎస్పీ-బీఎస్పీ పొత్తు ఖరారు కావడంతో యూపీలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ముక్కోణపు పోటీ ఖాయమని తేలింది. కాగా యూపీలో మొత్తం 80 స్ధానాల్లో కాంగ్రెస్‌ పార్టీ తన అభ్యర్ధులను బరిలో దింపుతుందని ఆ పార్టీ చీఫ్‌ రాహుల్‌ గాంధీ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంతో పాటు యూపీ బాధ్యతలను ఆమెకు అప్పగించడంతో కీలక రాష్ట్రంలో మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చని కాంగ్రెస్‌ భావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement