డిప్యూటీ సీఎం ఇంటిపై సీబీఐ దాడులు | Manish Sisodia Questioned By CBI On Corruption Charges | Sakshi
Sakshi News home page

డిప్యూటీ సీఎం ఇంటిపై సీబీఐ దాడులు

Jun 16 2017 1:26 PM | Updated on Sep 22 2018 8:25 PM

డిప్యూటీ సీఎం ఇంటిపై సీబీఐ దాడులు - Sakshi

డిప్యూటీ సీఎం ఇంటిపై సీబీఐ దాడులు

ఢిల్లీ ప్రభుత్వానికి అపవాదు ఎదురైంది. ఆమ్‌ ఆద్మీ పార్టీ సీనియర్‌ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా ఇంటిపై శుక్రవారం సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు.

న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వానికి అపవాదు ఎదురైంది. ఆమ్‌ ఆద్మీ పార్టీ సీనియర్‌ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా ఇంటిపై శుక్రవారం సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. పెద్ద మొత్తంలో ఆయన అవినీతి అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణల కిందట సిసోడియా నివాసం, ఆయనకు సంబంధించిన ఇతర కార్యాలయాలపైన ఏకకాలంలో దాడులు నిర్వహించి తనిఖీలు చేశారు.

ఢిల్లీ ప్రజలతో ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మమేకమయ్యే కార్యక్రమం అయిన ‘టాక్‌ టు ఏకే’  అనే పేరిట అక్రమాలకు పాల్పడ్డారని, పెద్ద మొత్తంలో డబ్బు పోగేసుకొని అవినీతి చర్యలకు దిగారని సీబీఐకి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో గత జనవరిలోనే ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ తాజాగా డిప్యూటీ సీఎం ఇంటిపై దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియాను ప్రశ్నిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఇదిలా ఉండగా తాము నిర్వహించింది దాడులు కాదని, నిబంధనల అతిక్రమణల వివరాలు తెలుసుకునేందుకు వచ్చామంటూ ఓ సీబీఐ అధికారి చివరిగా మీడియాకు చెప్పడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement