పార్టీ జెండాతో షూ తుడుచుకున్నాడు..

Man Wipes Shoes With BJP Flag - Sakshi

లక్నో : లోక్‌సభ ఎన్నికల ఆరో దశ పోలింగ్‌లో చెదురుమదురు ఘటనలు చోటుచేసుకున్నాయి. బీజేపీ జెండాతో ఓ వ్యక్తి తన షూస్‌ తుడుచుకోవడం ఘర్షణకు దారితీసింది. యూపీలోని షాగంజ్‌లో బూత్‌ నెంబర్‌ 369 వద్ద ఈ ఘటనతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.

పోలింగ్‌ కేంద్రం సమీపంలోని ఓ చెట్టుకింద కాషాయ పార్టీ జెండా పడి ఉండగా, ఓ వ్యక్తి తన షూస్‌ను దాంతో శుభ్రం చేసుకున్నాడు. ఇది ఓ బీజేపీ కార్యకర్త కంటపడటంతో ఆ వ్యక్తిపై బీజేపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. మూకను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top