తూర్పులో విజయం సాధిస్తా: బీజేపీ అభ్యర్థి | Making the success of the East: BJP candidate | Sakshi
Sakshi News home page

తూర్పులో విజయం సాధిస్తా: బీజేపీ అభ్యర్థి

Oct 8 2014 11:31 PM | Updated on Mar 29 2019 9:13 PM

తూర్పులో విజయం సాధిస్తా: బీజేపీ అభ్యర్థి - Sakshi

తూర్పులో విజయం సాధిస్తా: బీజేపీ అభ్యర్థి

భివండీ పట్టణంలోని 137-తూర్పు నియోజక వర్గంలో తన గెలుపు ఖాయమని బీజేపీ అభ్యర్థి సంతోష్ ఎం. శెట్టి ధీమా వ్యక్తం చేశారు.

భివండీ, న్యూస్‌లైన్: భివండీ పట్టణంలోని 137-తూర్పు నియోజక వర్గంలో తన గెలుపు ఖాయమని బీజేపీ అభ్యర్థి సంతోష్ ఎం. శెట్టి ధీమా వ్యక్తం చేశారు. అత్యధికంగా తెలుగు ప్రజలు స్థిరపడిన కామత్‌ఘర్, భాగ్యనగర్, గణేష్‌నగర్, రాజీవ్‌గాంధీ నగర్, ఆశ్వీద్‌నగర్, పేవా గావ్, మాన్‌సరోవర్ ప్రాంతాలల్లో బుధవారం మహార్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధి కావాలంటే అన్ని ప్రాంతాలల్లో బీజేపీని గెలిపించి ప్రధాన మంత్రికి బహుమతిగా ఇవ్వాలని కోరారు.

తనకు తెలుగు ప్రజల మద్దత్‌తో పాటు కొందరు మరాఠీ, ముస్లింలు, గుజరాతీ, ఉత్తర భారతీయులు కూడా మద్దతు ఇస్తున్నారని అన్నారు. భివండీలో బీజేపీ విజయం సాధిస్తేనే పట్టణ అభివృద్ధి సుసాధ్యమని అన్నారు. ఈ ర్యాలీలో అత్యధికంగా తెలుగు ప్రజలతో పాటు ఆర్.పి.ఐ. పట్టణ అధ్యక్షుడు మహేంద్ర గైక్వాడ్, బీజేపీ కార్పొరేటర్లు నిలేష్ చౌదరి, హనుమాన్ చౌదరి, లక్ష్మీ పాటిల్‌తో పాటు భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement