న్యూఢిల్లీ:
భారత దేశంలో పాలకులకు, మీడియాకు మధ్య పోరాటం జరగడం, మీడియా గొంతు పిసికేయాలనుకోవడం బ్రిటీష్ పాలకుల నాటి నుంచే ఉంది. కోల్కతా నుంచి వెలువడుతున్న భారత్లో తొట్టతొలి, ఆ మాటకొస్తే ఆసియాలోనే మొట్టమొదటి పత్రికైనా ‘హికీస్ బెంగాల్ గెజిట్’ పత్రికను 1782, మార్చి 23వ తేదీన పాలకులు మూసివేయించారు. ఆ పత్రికను నడుపుతున్న ఆగస్టస్ హికీని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అప్పటి భారత గవర్నర్ జనరల్ వారెస్ హాస్టింగ్స్ను ఉద్దేశించి ‘లార్డ్ క్లైవ్కు దిక్కుమాలిన వారసుడు’ అని సంబోంధించినందుకు ఆయనపై కేసు పెట్టి అరెస్ట్ చేశారు.
కొద్దికాలం జైలు జీవితం అనుభవించిన హికీ జైలు నుంచి, ఆ కేసు నుంచి బయటపడ్డారు. ఆ తర్వాత ఐదారు కేసుల్లో ఇరుక్కోవడంతో బ్రిటీష్ ప్రభుత్వం ఆయన పేపర్ను మూసివేసి ప్రెస్ను స్వాధీనం చేసుకొంది. పత్రికల నోరు నొక్కేందుకు బ్రిటీష్ పాలకులు దేశద్రోహం నేరం కింద తీసుకొచ్చిన 124 ఏ సెక్షన్ నేటికి కూడా అమల్లో ఉండడం ఆశ్చర్యం. నేడు ఎన్డీటీవీపై సీబీఐ నిర్వహించిన దాడుల నేపథ్యంలో ఈ అంశాలను గుర్తుచేసుకోవాల్సి వస్తోంది. నాడు ఆగస్టస్ హికీ, నాటి బ్రిటీష్ పాలకులను ఎలా పడితే అలా విమర్శించేవారు. నేటి మీడియా కూడా ఆ స్థాయిలో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా స్పందించడం లేదు. అయినా పత్రికలపై పరువు నష్టం కేసులు, దేశద్రోహం కేసులు పెడుతూనే ఉన్నారు.
ఎన్డీటీవీపై ఏసీబీ దాడులకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి సంబంధం లేదని, తమ విధి నిర్వహణలో భాగంగానే ఏసీబీ దాడులు జరిపిందని పాలకపక్ష వర్గాలు చెబుతున్నాయిగానీ జరిగిన సమయాన్ని దృష్టిలో పెట్టుకుంటే అనుమానాలు రాకపోవు. ఎన్డీటీవీ ఛానల్కు ఓ ప్రత్యేకమైన ఎజెండా ఉందని ఆరోపించిన బీజేపీ అధికార ప్రతినిధిని చర్చా గోష్టి నుంచి అర్దాంతరంగా వెళ్లిపోవాల్సిందిగా ఛానెల్ కోరడం, ఆ తర్వాత ఢిల్లీ జర్నలిస్టులు భయం, భయంగా తమ విధులు నిర్వహించాల్సి వస్తోందని ఛానెల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రవిశ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామాల అనంతరమే ఏసీబీ దాడులు జరిగాయి. ఈ పరిణామాలకు సంబంధం లేదా పరిణామాలన్నీ కూడా యాదశ్చికమేనా? ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్తంభంగా పరిగణిస్తున్న మీడియా తమ విధుల నిర్వహణలో ఇలాంటి అవాంతరాలను, పోరాటాలను ఎదుర్కొంటూ ముందుకు సాగిపోవాల్సిందే.
-ఓ సెక్యులరిస్ట్ కామెంట్
మీడియా పీక పిసికేయడం కొత్తకాదు
Published Sat, Jun 10 2017 5:38 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement