భారత్కు జపాన్ భారీ సాయం | Japan to give loan worth Rs 5,479 crore to India for metro projects | Sakshi
Sakshi News home page

భారత్కు జపాన్ భారీ సాయం

Nov 29 2015 3:59 PM | Updated on Oct 16 2018 5:04 PM

భారత్కు జపాన్ భారీ సాయం - Sakshi

భారత్కు జపాన్ భారీ సాయం

భారత్కు జపాన్ భారీ సహాయం అందించనున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. చెన్నై, అహ్మదాబాద్లోని మెట్రో ప్రాజెక్టుల కోసం మొత్తం రూ.5,479 కోట్ల సహాయం అందించనున్నట్లు ఆర్దికమంత్రి ఆదివారం తెలిపారు.

టోక్యో: భారత్కు జపాన్ భారీ సహాయం అందించనున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. చెన్నై, అహ్మదాబాద్లోని మెట్రో ప్రాజెక్టుల కోసం మొత్తం రూ.5,479 కోట్ల సహాయం అందించనున్నట్లు ఆర్దికమంత్రి ఆదివారం తెలిపారు. ఇప్పటికే రెండు దేశాలు ఈ ఒప్పందాలపై సంతకాలు చేసినట్లు చెప్పారు.

చెన్నై మెట్రో రైల్ ప్రాజెక్టు(4వ దశ)కు(రూ.1,069 కోట్లు), అహ్మదాబాద్ మెట్రో ప్రాజెక్టుకు రూ.4,410 కోట్ల సహాయం చేయనుందని చెప్పారు. భారత్లో చేపట్టే పలు ప్రాజెక్టులకు తరుచుగా జపాన్ ఆర్థిక సహాయం అందిస్తున్న విషయం తెలిసిందే. లోన్ రూపంలో ఇచ్చే ఈ ఆర్థికమొత్తాన్ని భారత్ కాలక్రమంలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement