పాక్ కాల్పుల్లో జవాను మృతి | Indian civilian dead in pak attack | Sakshi
Sakshi News home page

పాక్ కాల్పుల్లో జవాను మృతి

Nov 13 2016 2:01 AM | Updated on Mar 23 2019 8:37 PM

సరిహద్దులో పాకిస్తాన్ కాల్పుల విరమణకు తూట్లు పొడుస్తూనే ఉంది.

శ్రీనగర్: సరిహద్దులో పాకిస్తాన్ కాల్పుల విరమణకు తూట్లు పొడుస్తూనే ఉంది. జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లా కెరార్ సెక్టార్‌లో శనివారం పాక్ బలగాలు జరిపిన కాల్పుల్లో  హర్షిద్ బదార్య అనే భారత జవాను ఒకరు మృతిచెందారు. మంకామ్లా అనే మరో సైనికుడు గాయపడ్డాడు.  శత్రు సైనికులు ఉదయం కాల్పులకు, మోర్టారు దాడులకు పాల్పడ్డారని, మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని ఆర్మీ వెల్లడించింది.

Advertisement
 
Advertisement
Advertisement