పాకిస్థాన్ పట్ల హెచ్చరిక, సృహతో ఉండాల్సిన అవసరం ఉందని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అభిప్రాయపడ్డారు.
పాకిస్థాన్ తో మరింత జాగ్రత్తగా ఉండాలి: మోదీ
Jun 27 2016 7:42 PM | Updated on Aug 21 2018 9:33 PM
న్యూఢిల్లీ: పాకిస్థాన్ పట్ల హెచ్చరిక, సృహతో ఉండాల్సిన అవసరం ఉందని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అభిప్రాయపడ్డారు. ఆదేశం మనసులో ఒక ఉద్దేశాన్ని ఉంచుకొని చర్చలు జరుపుతుందని అన్నారు. ఉగ్రవాదం పొరుగు దేశం సరిహద్దుల నుంచే పుట్టుకొస్తుందనే తమ అభిప్రాయంతో ప్రపంచం ఏకీభవించిందని తెలిపారు. సమస్యలపై రెండు దేశాలు మాత్రమే చర్చించాలని హురియ త్ నేతలతో చర్చించాల్సిన అవసరం లేదని, ముందుగా ముంబై, పఠాన్ కోట్ దాడిపై చర్చించాలని స్పష్టం చేశారు. పాకిస్థాన్ లో పర్యటించడం, ఆదేశ ప్రధానిని భారత్ కు ఆహ్వానించడంతో ప్రపంచం భారతదేశ చిత్తశుద్ధిని గుర్తించిందని మోదీ అన్నారు.
Advertisement
Advertisement