అణ్వస్త్ర ‘పృథ్వీ’ సిద్ధంగా వుంది

India Successfully Test Fires Nuclear Capable Prithvi 2 - Sakshi

బాలాసోర్‌, ఒడిశా : స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన అణ్వస్త్ర క్షిపణి ఫృథ్వీ-2ను భారత్‌ విజయవంతంగా ప్రయోగించింది.  బుధవారం అబ్దుల్‌ కలాం ద్వీపం నుంచి ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. మధ్య శ్రేణి ఖండాంతర క్షిపణి అయిన ఫృథ్వీ-2 సుమారు 350 కిలోమీటర్ల దూరంలోని ఉపరితలంపై గల లక్ష్యాలను చేధించగలదు.

500 కేజీల బరువైన వార్‌హెడ్‌ను మోసుకెళ్ల గలదు. అత్యవసర సమయాల్లో సన్నద్ధత దృష్ట్యా వ్యూహాత్మక దళాలు ఈ పరీక్షను నిర్వహించినట్లు రక్షణ శాక వర్గాలు పేర్కొన్నాయి. 2003లో పృథ్వీ-2 సైన్యంలో చేరింది. డీఆర్‌డీవో రూపొందించిన ఇంటిగ్రేటెడ్‌ గైడెడ్‌ మిస్సైల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాంను తొలిసారిగా పృథ్వీ-2కు జోడించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top