breaking news
prithvi 2
-
అణ్వస్త్ర ‘పృథ్వీ’ సిద్ధంగా వుంది
బాలాసోర్, ఒడిశా : స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన అణ్వస్త్ర క్షిపణి ఫృథ్వీ-2ను భారత్ విజయవంతంగా ప్రయోగించింది. బుధవారం అబ్దుల్ కలాం ద్వీపం నుంచి ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. మధ్య శ్రేణి ఖండాంతర క్షిపణి అయిన ఫృథ్వీ-2 సుమారు 350 కిలోమీటర్ల దూరంలోని ఉపరితలంపై గల లక్ష్యాలను చేధించగలదు. 500 కేజీల బరువైన వార్హెడ్ను మోసుకెళ్ల గలదు. అత్యవసర సమయాల్లో సన్నద్ధత దృష్ట్యా వ్యూహాత్మక దళాలు ఈ పరీక్షను నిర్వహించినట్లు రక్షణ శాక వర్గాలు పేర్కొన్నాయి. 2003లో పృథ్వీ-2 సైన్యంలో చేరింది. డీఆర్డీవో రూపొందించిన ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంను తొలిసారిగా పృథ్వీ-2కు జోడించారు. -
లక్ష్యం 350 కిమీ.. మరోసారి పృథ్వీ-2 సక్సెస్!
బాలాసోర్: దేశీయంగా రూపొందించిన అణ్వాయుధ సామర్థ్యం గల పృథ్వీ-2 క్షిపణిని భారత్ సోమవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా చాందిపూర్లోని టెస్ట్ రేంజ్లో ఆర్మీ రెండుసార్లు ఈ క్షిపణీని వెంటవెంటనే పరీక్షించింది. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయాణించే ఈ క్షిపణి 350 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఢీకొనగలదు. 500, వెయ్యి కిలోల వార్హెడ్స్ మోసుకెళ్లగలుతుంది. ఇప్పటికే ఈ క్షిపణికి సంబంధించి ఇలాంటి పరీక్షలు రెండింటిని 2009 అక్టోబర్ 12న విజయవంతంగా నిర్వహించారు. ఇప్పటికే ఉత్పత్తి చేసిన క్షిపణుల్లో ర్యాండమ్గా పృథ్వీ-2 క్షిపణిని ఎంచుకొని పరీక్షలు నిర్వహించారు. స్ట్రాటెజిక్ ఫోర్స్ కమాండ్ (ఎస్ఎఫ్ఎస్), డీఆర్డీవో శాస్త్రవేత్తల పర్యవేక్షణలో శిక్షణ కసరత్తులో భాగంగా ఈ క్షిపణి పరీక్షలు నిర్వహించినట్టు రక్షణశాఖ వర్గాలు తెలిపాయి.