రూ.2 పెరిగిన వంటగ్యాస్‌ | Increased Rs 2 to domestic LPG | Sakshi
Sakshi News home page

రూ.2 పెరిగిన వంటగ్యాస్‌

Jan 1 2017 2:42 AM | Updated on Sep 5 2017 12:03 AM

వంటగ్యాస్‌ ధరను రూ.2 పెంచుతూ ప్రభుత్వ రంగ ఆయిల్‌ సంస్థలు శనివారం నిర్ణయం తీసుకున్నాయి.

న్యూఢిల్లీ: వంటగ్యాస్‌ ధరను రూ.2 పెంచుతూ ప్రభుత్వ రంగ ఆయిల్‌ సంస్థలు శనివారం నిర్ణయం తీసుకున్నాయి. దీంతోపాటు విమాన ఇంధనం, కిరోసిన్‌ ధరలూ పెరిగాయి. సబ్సిడీ సిలిండర్‌పై నెలకు రూ.2 పెంచాలని గత జూలైలో కేంద్రం నిర్ణయించింది. దీని ప్రకారమే సిలిండర్‌ ధర పెంచినట్లు చమురు సంస్థలు వెల్లడించాయి. కాగా, సబ్సిడీయేతర సిలిండర్‌కు రూ.1, కిరోసిన్‌పై 26పైసలు పెరిగింది.

Advertisement
 
Advertisement
Advertisement