ప్రముఖ మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూ బీజేపీ నుంచి వైదొలిగి తన రాజ్యసభ స్థానానికి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో రూపా గంగూలీని నియమిస్తూ ఆపార్టీ నిర్ణయం తీసుకుంది.
మహాభారత్ టీవీ సీరయల్లోని ద్రౌపది పాత్ర ద్వారా ఆమె ప్రాచుర్యాన్ని పొందిన రూపా గతేడాది బీజేపీలో చేరారు. రాష్ట్రపతి కోటా ద్వారా సిద్ధూ రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఇటీవల బీజేపీకి రాజీనామా చేసి ఆవాజ్ ఇ పంజాబ్ పేరుతో రాజకీయ పార్టీ ఏర్పాటు చేశారు. తన ఎంపీ స్థానానికి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలోరూపాను నియమిస్తూ బీజేపీ నిర్ణయం తీసుకుంది.