ఐఐటీ ముంబై కీలక నిర్ణయం | IIT Bombay Suspends Face To Face Classes Due To Coronavirus | Sakshi
Sakshi News home page

ఐఐటీ ముంబై కీలక నిర్ణయం

Jun 25 2020 9:46 AM | Updated on Jun 25 2020 11:02 AM

IIT Bombay Suspends Face To Face Classes Due To Coronavirus - Sakshi

సాక్షి, ముంబై : రాష్ట్రంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ఐఐటీ ముంబై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం మొత్తం ముఖాముఖి క్లాసులను రద్దు చేసింది. ఇకపై ఆన్‌లైన్‌ ద్వారానే క్లాసులు నిర్వహించాలని నిశ్చయించుకుంది. విద్యార్థుల ఆరోగ్యమే అత్యంత ముఖ్యమని భావించిన ఐఐటీ ముంబై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్‌ ద్వారా క్లాసులు వినేందుకు పేద విద్యార్థులకు అవసరమైన ఆర్థిక సహాయం చేయాలని దాతలను కోరింది. వారు ఆన్‌లైన్‌ చదువులు కొనసాగించటానికి అవసరమైన ల్యాప్‌టాప్స్‌, ఇంటర్‌నెట్‌ కనెక్షన్‌లు, ఇతర సౌకర్యాలు కల్పించడానికి దాదాపు ఐదు కోట్ల రూపాయలు అవసరమవుతాయని దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలని విన్నవించింది.

చదవండి : 24గంటల్లో.. 16, 922 కరోనా కేసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement