భారీ వర్షాలు.. రెడ్‌ అలర్ట్‌ | Heavy Rains In Kerala Red Alert Issued | Sakshi
Sakshi News home page

భారీ వర్షాలు.. రెడ్‌ అలర్ట్‌

Aug 12 2018 7:03 AM | Updated on Aug 12 2018 11:17 AM

Heavy Rains In Kerala Red Alert Issued - Sakshi

భారీ వర్షాలతో పలు జిల్లాల్లో వాతావరణ అధికారులు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు

తిరువనంతపురం : కేరళలో వరద బీభత్సం కొనసాగుతోంది. భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 37 మంది మరణించగా, ఇప్పటివరకు 35, 874 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. భారీ వర్షాలతో పలు జిల్లాల్లో వాతావరణ అధికారులు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు పెరియన్‌ నదికి వరద పోటెత్తుతోంది. ఇడుక్కీ డ్యామ్‌కు వరద మరింత పెరగడంతో గేట్లను పూర్తిగా ఎత్తి దిగువనకు నీళ్లు వదులుతున్నారు.

ఇడుక్కీ నుంచి వరద ఉధృతి మరింత పెరగడంతో దిగువను ఉన్న ప్రాంతాలను అధికారులు పునరావాస ప్రాంతాలకు తరలించారు. కేరళ సర్కారుకు తగినన్ని సహాయ నిధులకు విడుదల చేయాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. దేశంలో పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడే అవకావాలున్నాయని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌డీఎంఏ) హెచ్చరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement