ఈసారి అక్కడ జెండా ఎగరేసేది అమ్మాయిలే.. | Gujarat to celebrate Republic Day by honouring daughters | Sakshi
Sakshi News home page

ఈసారి అక్కడ జెండా ఎగరేసేది అమ్మాయిలే..

Jan 12 2016 6:08 PM | Updated on Aug 21 2018 2:39 PM

ఈసారి అక్కడ జెండా ఎగరేసేది అమ్మాయిలే.. - Sakshi

ఈసారి అక్కడ జెండా ఎగరేసేది అమ్మాయిలే..

గుజరాత్ ప్రభుత్వం ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకలను అందరికీ స్ఫూర్తిదాయకంగా నిర్వహించనుంది. తమ రాష్ట్రంలోని అన్ని (ప్రభుత్వ, ప్రభుత్వేతర) పాఠశాలల్లో జాతీయపతాకాలను ఆయా గ్రామాల్లో అత్యధికంగా చదివిన బాలికలు, యువతులతో ఎగురవేయించనుంది

అహ్మదాబాద్: గుజరాత్ ప్రభుత్వం ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకలను అందరికీ స్ఫూర్తిదాయకంగా నిర్వహించనుంది. తమ రాష్ట్రంలోని అన్ని (ప్రభుత్వ, ప్రభుత్వేతర) పాఠశాలల్లో జాతీయ పతాకాలను ఆయా గ్రామాల్లో బాగా చదివిన బాలికలు, యువతులతో ఎగరేయిస్తోంది.  ఈ మేరకు ఇప్పటికే అన్ని జిల్లాల ప్రాథమిక విద్యాశాఖ అధికారులకు ఆదేశాలను పంపించింది.

అంతేకాకుండా, ఈ ఏడాది అంటే 2016లో ఆడపిల్లలను కన్న తల్లిదండ్రులను ప్రత్యేకంగా ప్రభుత్వం తరుపున ఆ రోజు సన్మానించనుంది. ఇందుకోసం ఆయా పాఠశాలకు ప్రభుత్వమే రూ.300 కేటాయించనుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి రిపబ్లిక్ డే నాడు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి థీమ్ గా 'బేటీ కో సలాం, దేశ్ కే నామ్' అని నిర్ణయించారు. బాలికల విషయంలో లింగవివక్షను రూపుమాపేందుకు కేంద్ర ప్రభుత్వంతోపాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement