వాళ్లను షూట్‌ చేయాలి: కర్ణాటక గవర్నర్‌

Governor Vajubhai Vala Hits Out Terrorism at Public Convention in Bengaluru - Sakshi

సాక్షి, బెంగళూరు: పాకిస్తాన్‌ ఉగ్రవాది అజ్మల్‌ కసబ్‌ వర్ధంతి నిర్వహించేవారిని కాల్చి చంపాలని కర్ణాటక గవర్నర్‌ వజుభాయ్‌ రుడాభాయ్‌ వాలా బెంగళూరులో వ్యాఖ్యానించారు. కసబ్‌ లాంటి ఉగ్రవాదులు, దేశద్రోహులను పట్టుకున్న మూడ్రోజుల్లోనే ఉరిశిక్ష వేయాలన్నారు. భద్రతలో పటిష్టంగా ఉన్న ఇజ్రాయెల్‌ లాంటి దేశమే అభివృద్ధిచెందుతుందని పేర్కొన్నారు. భారత్‌లో పరిస్థితులు వేరని అన్నారు. ‘ కొందరు కసబ్‌ వర్ధంతి నిర్వహిస్తున్నారు. వారిని తుపాకీతో కాల్చి మృతదేహాలు దొరక్కుండా చేయాలి’ అని అన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top