మీడియాకు భారీగా ప్రభుత్వ బకాయిలు | Governments must pay up huge dues of advertisement money | Sakshi
Sakshi News home page

మీడియాకు భారీగా ప్రభుత్వ బకాయిలు

May 21 2020 5:09 AM | Updated on May 21 2020 5:09 AM

Governments must pay up huge dues of advertisement money - Sakshi

న్యూఢిల్లీ:  కేంద్ర ప్రభుత్వ ప్రకటనల విభాగం, పలు రాష్ట్రాల ప్రకటనల విభాగాలు మీడియా సంస్థలకు రూ. 1500 కోట్ల నుంచి రూ. 1800 కోట్ల వరకు బకాయి ఉన్నాయని ఇండియన్‌ న్యూస్‌పేపర్‌ సొసైటీ(ఐఎన్‌ఎస్‌) సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆ బకాయిలు వారు ఇప్పట్లో చెల్లించకపోవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. మీడియా రంగం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను ఒక అఫిడవిట్‌లో ఐఎన్‌ఎస్‌ సుప్రీంకోర్టు ముందు ఉంచింది. ‘మీడియా ఇండస్ట్రీ అంచనాల ప్రకారం..వివిధ మీడియా సంస్థలకు డీఏవీపీ(డైరెక్టరేట్‌ ఆఫ్‌ అడ్వర్టైజ్‌మెంట్‌ అండ్‌ విజువల్‌ పబ్లిసిటీ) సుమారు రూ. 1500 కోట్ల నుంచి రూ. 1800 కోట్ల వరకు బకాయి ఉంది. ఇందులో రూ. 800 కోట్ల నుంచి రూ. 900 కోట్ల వరకు ప్రింట్‌ మీడియా వాటా’ అని వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement