పట్టాలు తప్పిన రైలు.. నదిలో బోగీలు | Goods train derails in Haryana, bogies fall in river | Sakshi
Sakshi News home page

పట్టాలు తప్పిన రైలు.. నదిలో బోగీలు

Apr 20 2017 5:27 PM | Updated on Apr 3 2019 5:51 PM

హర్యానాలో ఓ గూడ్సు రైలు పట్టాలు తప్పింది. అంబాలా జిల్లాలో మార్కంద నది వంతెనపై వెళుతున్న రైలుకు చెందిన 15 బోగీలు పట్టాలు తప్పి నదిలో పడ్డాయి.

చండీగఢ్‌: హర్యానాలో ఓ గూడ్సు రైలు పట్టాలు తప్పింది. అంబాలా జిల్లాలో మార్కంద నది వంతెనపై వెళుతున్న రైలుకు చెందిన 15 బోగీలు పట్టాలు తప్పి నదిలో పడ్డాయి. ఈ బోగీల్లో బొగ్గు ఉన్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైలు డ్రైవర్‌ గార్డు సురక్షితంగా ఉన్నట్లు తెలిసింది.

ఈ ఘటన జరగడంతో అంబాలా-సహరాన్‌పూర్‌ మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తిరిగి యథాస్థితిని తీసుకొచ్చేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దెబ్బతిన్న వంతెనను కూడా బాగు చేస్తున్నారు. బ్రిడ్జిని దాటుతున్న రైలు ఎలా పట్టాలు తప్పిందో ఇంకా కారణాలు తెలియరాలేదని అధికారులు తెలిపారు. ఘటనా ప్రాంతానికి చండీగఢ్‌ 45 కిలోమీటర్ల దూరంలో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement