కరణ్‌ థాపర్‌కు జీకే రెడ్డి పురస్కారం | G.K. Reddy award for journalist Karan Thapar | Sakshi
Sakshi News home page

కరణ్‌ థాపర్‌కు జీకే రెడ్డి పురస్కారం

Mar 24 2018 2:39 AM | Updated on Mar 24 2018 2:39 AM

G.K. Reddy award for journalist Karan Thapar - Sakshi

మన్మోహన్‌ నుంచి అవార్డును అందుకుంటున్న కరణ్‌ థాపర్‌. చిత్రంలో సుబ్బరామిరెడ్డి, ఆనంద్‌శర్మ తదితరులు

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: పాత్రికేయరంగంలో ఎనలేని కృషిచేసిన ప్రముఖ జర్నలిస్టు, టీవీ వ్యాఖ్యాత కరణ్‌ థాపర్‌ను జీకే రెడ్డి స్మారక అవార్డు వరించింది. రాజ్యసభ సభ్యుడు, జీకే రెడ్డి స్మారక అవార్డు వ్యవస్థాపకుడు టి.సుబ్బరామిరెడ్డి, టీఎస్‌ఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఢిల్లీలో అవార్డు ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రధాని మన్మోహన్‌ చేతుల మీదుగా థాపర్‌ ఈ అవార్డును అందుకున్నారు. సుబ్బరామిరెడ్డి, అవార్డు కమిటీ చైర్మన్, మాజీ కేంద్రమంత్రి కరణ్‌ సింగ్, మాజీ కేంద్ర మంత్రి ఆనంద్‌ శర్మ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అవార్డుతోపాటు ప్రశంసా పత్రం, రూ.5లక్షల నగదు అందజేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement