పాట్నా పేలుళ్ల అనుమానితులు అరెస్ట్ | Four more suspects arrested for blasts that targeted Narendra modi patna rally | Sakshi
Sakshi News home page

పాట్నా పేలుళ్ల అనుమానితులు అరెస్ట్

May 21 2014 12:06 PM | Updated on Oct 17 2018 5:14 PM

నరేంద్ర మోడీ టార్గెట్‌గా జరిగిన పాట్నా పేలుళ్ల కేసులో జాతీయ దర్యాప్తు కీలక పురోగతి సాధించింది.

రాంచీ : నరేంద్ర మోడీ టార్గెట్‌గా జరిగిన పాట్నా పేలుళ్ల కేసులో  జాతీయ దర్యాప్తు కీలక పురోగతి సాధించింది. ఈ కేసుకు సంబంధించి నలుగురు అనుమానితులను ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకుంది. గత ఏడాది అక్టోబర్‌ 27 బీహార్ రాజధాని పాట్నాలో బీజేపీ హుంకార్ ర్యాలీ నిర్వహించింది. మోడీ  ఈ కార్యక్రమానికి నరేంద్ర మోడీ ప్రధాన వక్తగా హాజరైన విషయం తెలిసిందే.

ఈ సందర్బంగా పాట్నాలో వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఆ పేలుళ్లలో ఆరుగురు మృతి చెందగా, దాదాపు 100 మంది గాయపడ్డారు. వరుస పేలుళ్ల కేసుకు సంబంధించిన అనుమానితులుగా భావిస్తున్న హైదర్ అలీ, నుమస్, తౌఫిక్, ముజిబుల్లాను అరెస్ట్ చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement