కేంద్ర మాజీ మంత్రి, ప్రణాళిక సంఘం మాజీ డిప్యూటీ చైర్మన్ మోహన్ ధరియా మరణించారు.
కేంద్ర మాజీ మంత్రి, ప్రణాళిక సంఘం మాజీ డిప్యూటీ చైర్మన్ మోహన్ ధరియా మరణించారు. ఆయన వయసు 89. భార్య, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు.
ధరియా కిడ్నీ దెబ్బతినడంతో శనివారం పుణె ఆస్పత్రికి తరలించారు. అయితే ఆరోగ్యం కుదుటపడలేదని కుటుంబ స్నేహితుడు ఒకరు చెప్పారు. ఆస్పత్రిలోనే ధరియా సోమవారం కన్నుమూసినట్టు తెలిపారు. ధరియా కేంద్ర రాజకీయాల్లో ఒకప్పుడు కీలక పాత్ర పోషించారు.