దేశంలో తొలి మహిళా ఇమామ్‌! | First in India, Kerala woman becomes Imam; gets death threat | Sakshi
Sakshi News home page

దేశంలో తొలి మహిళా ఇమామ్‌!

Jan 28 2018 4:38 AM | Updated on Jan 28 2018 4:38 AM

First in India, Kerala woman becomes Imam; gets death threat - Sakshi

మహిళ ఇమామ్‌ జమిథా

మలప్పురం: ఇటీవల దళితుల్ని ఆలయాల్లో పూజారులుగా నియమించిన కేరళలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. దేశచరిత్రలోనే తొలిసారిగా ఓ మహిళ శుక్రవారం ప్రార్థనల(జుమ్మా నమాజ్‌)కు ఇమామ్‌గా వ్యవహరించింది. మలప్పురంలోని ఖురాన్‌ సున్నత్‌ సొసైటీ కార్యదర్శి జమిథా(34) తమ సంస్థ కార్యాలయంలో శుక్రవారం నమాజ్‌కు నేతృత్వం వహించారు. ఈ ప్రార్థనలకు పలువురు మహిళలు సహా 80 మంది హాజరయ్యారు. ఈ విషయమై జమిథా స్పందిస్తూ.. పవిత్ర ఖురాన్‌ పురుషులు, స్త్రీల మధ్య ఎలాంటి వివక్ష చూపదని చెప్పారు. మహిళలు ఇమామ్‌ కాకూడదని ఖురాన్‌లో ఎక్కడా లేదని వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement