పట్టాలు తప్పిన ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ | Falaknuma Express Derail in Cuttack | Sakshi
Sakshi News home page

Oct 4 2018 6:39 PM | Updated on Oct 4 2018 6:47 PM

Falaknuma Express Derail in Cuttack - Sakshi

ఈ ఘటన ఒడిశాలోని కటక్‌ సమీపంలో చోటుచేసుకుంది.

కటక్‌: సికింద్రాబాద్‌-హౌరా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌కు గురువారం పెను ప్రమాదం తప్పింది. గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ గార్డ్‌ బోగీ పట్టాలు తప్పింది. ఈ ఘటన ఒడిశాలోని కటక్‌ సమీపంలో చోటుచేసుకుంది. దీంతో రైలును వెంటనే ఆపేశారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మరమ్మతులు చేపట్టారు. దీంతో ఆ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కానట్టుగా తెలుస్తోంది. గార్డ్‌ బోగీ కాకుండా ఇతర బోగీలు పట్టాలు తప్పి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలు తెలియరాలేదు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement