అనంత్‌నాగ్‌లో కొనసాగుతున్న ఎన్‌కౌంటర్‌ | Encounter Underway In Lal Chowk Area In Anantnag District | Sakshi
Sakshi News home page

అనంత్‌నాగ్‌లో కొనసాగుతున్న ఎన్‌కౌంటర్‌

Jul 25 2018 10:43 AM | Updated on Jul 25 2018 10:54 AM

Encounter Underway In Lal Chowk Area In Anantnag District - Sakshi

శ్రీనగర్‌ : జుమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య బుధవారం తెల్లవారుజాము నుంచి ఎదురుకాల్పులు​ కొనసాగుతున్నాయి. జిల్లాలోని లాల్‌ చౌక్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు తలదాచుకున్నారనే సమాచారంలో సైన్యం ఆ ప్రాంతాన్ని అర్ధరాత్రి నుంచి జల్లెడ పడుతుంది. భద్రతా బలగాల కదలికలను పసిగట్టిన ఉగ్రవాదులు ముందుగా కాల్పులు జరిపారు. దీంతో సైనికులు ప్రతికాల్పులు జరుపుతున్నారు.

ఉయం నాలుగు గంటల నుంచే పెద్ద ఎత్తున కాల్పుల, పేలుళ్ల శబ్దాలు వినబడుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై ఆర్మీ అధికారి ఒకరు మాట్లాడుతూ.. కొందరు తీవ్రవాదులు ఇక్కడి ఇళ్లలో ఉన్నారనే సమాచారంతో తాము కార్డన్‌ సెర్చ్‌ చేపట్టినట్టు తెలిపారు. లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు తీవ్రవాదులు ఈ ప్రాంతంలో ఉన్నట్టు అనుమానిస్తున్నామన్నారు. ఎన్‌కౌంటర్‌ ప్రారంభం కాగానే అధికారులు అనంత్‌నాగ్‌ పరిసర ప్రాంతాల్లో ఇంటర్‌నెట్‌ సేవలను నిలిపివేశారు. ముందు జాగ్రత్తగా శ్రీనగర్‌ నుంచి బనిహల్‌ మార్గంలో రైలు సర్వీసులను రద్దు చేస్తున్నుట్టు రైల్వే అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement