
జమ్మూకశ్మీర్ : జమ్మూకశ్మీర్లోని అనంతనాగ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతాదళాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతుల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహ్మద్ తౌఫిక్ ఉన్నారు. తౌఫిక్ రెండేళ్ల కిందట మణుగూరు నుంచి అదృశ్యమయ్యాడు. అప్పటి నుంచి తౌఫిక్ కశ్మీర్ వేర్పాటువాదులతో కలిసి పనిచేస్తున్నాడు. దీంతో తెలంగాణ పోలీసులు ఐసిస్ ప్రకటనతో అప్రమత్తమయ్యారు.