33 శాతం ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులు | electoral college with 33% criminal record will Pick our president | Sakshi
Sakshi News home page

33 శాతం ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులు

Jul 15 2017 4:33 PM | Updated on Oct 30 2018 5:17 PM

33 శాతం ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులు - Sakshi

33 శాతం ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులు

భారత రాష్ట్రపతిని మరో రెండు రోజుల్లో దేశంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలతో కూడిన ఎలక్టోరల్‌ కాలేజీ ఎన్నుకోబోతోంది.

న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతిని మరో రెండు రోజుల్లో దేశంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలతో కూడిన ఎలక్టోరల్‌ కాలేజీ ఎన్నుకోబోతోంది. ఈ కాలేజీలో 33 శాతం మందిపై క్రిమినల్‌ కేసులున్నాయంటే ఆశ్చర్యం వేస్తోంది. సోమవారం నాడు జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొననున్న 776 ఎంపీలు, 4,120 మంది ఎమ్మెల్యేలకుగాను 774 ఎంపీలు, 4,078 మంది ఎమ్మెల్యేలు ఎన్నికల సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్లను ‘ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం’ తనిఖీ చేసి ఓ నివేదికను రూపొందించింది.

రాష్ట్రపతి ఎలక్టోరల్‌ కాలేజీలో 451 మంది మహిళలు మాత్రమే ఉన్నారు. అంటే మొత్తం ఎలక్టోరల్‌ కాలేజీలో మహిళల సంఖ్య 9 శాతం మాత్రమే. దేశ చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కావాలని ఎప్పటి నుంచో మహిళలు డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో ఇంత తక్కువగా ఉండడం మరింత ఆశ్చర్యం. మొత్తం ఎలక్టోరల్‌ కాలేజీలో 71 శాతం కోటీశ్వరులున్నారని కూడా నివేదిక వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement