రూ.5.6 కోట్ల వీరభద్రసింగ్‌ ఆస్తుల అటాచ్‌ | ED attaches Rs 5.6 crore assets of Virbhadra Singh's family | Sakshi
Sakshi News home page

రూ.5.6 కోట్ల వీరభద్రసింగ్‌ ఆస్తుల అటాచ్‌

Oct 14 2017 4:47 AM | Updated on Sep 5 2018 1:38 PM

ED attaches Rs 5.6 crore assets of Virbhadra Singh's family - Sakshi

న్యూఢిల్లీ: నగదు అక్రమ రవాణా కేసు విచారణలో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) శుక్రవారం హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌ కుటుంబ సభ్యులకు చెందిన రూ.5.6 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌ చేసింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. తాము అటాచ్‌ చేసిన ఆస్తులు సీఎం కొడుకు విక్రమాదిత్య సింగ్, కూతురు అప్రజితా సింగ్, భార్య ప్రతిభా సింగ్‌ పేరిట ఉన్నాయని ఈడీ తెలిపింది. ఇందుకు సంబంధించి పీఎంఎల్‌ఏ చట్టం కింద ఉత్తర్వులు జారీచేశామని వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement