‘రామ మందిరంపై మోసం చేయొద్దు’ | Do not cheat on Rama mandhir construction | Sakshi
Sakshi News home page

‘రామ మందిరంపై మోసం చేయొద్దు’

May 15 2015 1:02 AM | Updated on Sep 3 2017 2:02 AM

అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం చట్టాన్ని తీసుకురావడంపై అశక్తతను వ్యక్తం చేసిన కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌పై హిందూ ఆధ్యాత్మిక నేతలు మండిపడుతున్నారు.

అయోధ్య: అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం చట్టాన్ని తీసుకురావడంపై అశక్తతను వ్యక్తం చేసిన కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌పై హిందూ ఆధ్యాత్మిక నేతలు మండిపడుతున్నారు. రామ మందిరం నిర్మిస్తామని ఎన్నికల ముందు బీజేపీ హామీ ఇచ్చిందని, నమ్మి ఓటేసిన ప్రజలను మోసం చేయవద్దంటున్నారు. ఎన్డీఏకు రాజ్యసభలో మెజారిటీ లేదని, రామమందిరంపై ప్రస్తుతం ఏమీ చేయలేమని ఆయన ఇటీవల పేర్కొన్నారు. ‘‘అధికారంలోకి వస్తే మందిర నిర్మాణానికి చట్టాన్ని తీసుకువస్తామన్న హామీని రాజ్‌నాథ్‌సింగ్ నిలబెట్టుకోవాలి’’ అని అని రామ జన్మభూమి న్యాస్ సభ్యుడు రాం విలాస్ వేదాంతి పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement