చర్చలు, సంప్రదింపులే పార్లమెంట్కు ఆత్మ: మోదీ | Debate, Discussion & Conversation is the soul of our Parliament: Narendra Modi | Sakshi
Sakshi News home page

చర్చలు, సంప్రదింపులే పార్లమెంట్కు ఆత్మ: మోదీ

Nov 26 2015 10:20 AM | Updated on Aug 15 2018 2:20 PM

చర్చలు, సంప్రదింపులే పార్లమెంట్కు ఆత్మ: మోదీ - Sakshi

చర్చలు, సంప్రదింపులే పార్లమెంట్కు ఆత్మ: మోదీ

చర్చలు, సంప్రదింపులే పార్లమెంట్కు ఆత్మ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాజ్యాంగమే మనకు ఆశారేఖ అని ఆయన వ్యాఖ్యానించారు.

న్యూఢిల్లీ : చర్చలు, సంప్రదింపులే పార్లమెంట్కు ఆత్మ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాజ్యాంగమే మనకు ఆశారేఖ అని ఆయన వ్యాఖ్యానించారు. హోప్ అనే పదంలో హెచ్ అంటే (H)  సామరస్యం, ఓ(o) అంటే అవకాశం, పి (P) అంటే ప్రజల భాగస్వామ్యం, ఈ (E) అంటే సమానత్వం అని  ప్రధాని  పేర్కొన్నారు.

 

గురువారం పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యే ముందు మోదీ మీడియాతో మాట్లాడుతూ  ప్రజల ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా ఎంపీలు వ్యవహరిస్తారని అన్నారు. పార్లమెంట సమావేశాలు సజావుగా జరగాలని నిన్న జరిగిన అఖిలపక్ష సమావేశంలో అందరూ ముక్తకంఠంతో చెప్పారని మోదీ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement