డిజిటల్‌ స్క్రీన్ల వల్ల ఎంతో డేంజర్‌ | Computer vision syndrome and digital eye strain | Sakshi
Sakshi News home page

అదే పనిగా సిస్టమ్, సెల్ ఫోన్లు చూస్తున్నారా?

Sep 22 2016 7:59 PM | Updated on Sep 28 2018 4:10 PM

డిజిటల్‌ స్క్రీన్ల వల్ల ఎంతో డేంజర్‌ - Sakshi

డిజిటల్‌ స్క్రీన్ల వల్ల ఎంతో డేంజర్‌

‘అరే! అదే పనిగా టీవీ ముందు కూర్చొని చూస్తున్నావు. కళ్లు పోతాయ్‌!’ అంటూ పిల్లలను పెద్దవాళ్లు హెచ్చరించడం మనకు సర్వసాధారణంగా అనుభవమే.

న్యూయార్క్‌: ‘అరే! అదే పనిగా టీవీ ముందు కూర్చొని చూస్తున్నావు. కళ్లు పోతాయ్‌!’ అంటూ పిల్లలను పెద్దవాళ్లు హెచ్చరించడం మనకు సర్వసాధారణంగా అనుభవమే. ఒకప్పుడు అది టీవీకి మాత్రమే వర్తించేది. ఇప్పుడు అది కంప్యూటర్లకు, లాప్‌ట్యాప్‌లకు, ట్యాబ్‌లెట్లకు, సెల్‌ఫోన్లకు అన్నింటికి వర్తిస్తుంది. వీటి వల్ల కళ్లు పూర్తిగా పోకపోయిన అనేక కంటి సమస్యలతోపాటు శారీరక సమస్యలు కూడా వస్తాయి. ఇప్పుడు వాటినే ‘డిజిటల్‌ హై స్ట్రెయిన్‌’ అని పిలుస్తున్నారు.

చూపు మందగించడం, మసగ్గా కనిపించడం, చూపు బ్లర్‌ అవడం, కళ్లు మంటపెట్టడం, గుంజడం లాంటి సమస్యలు తలెత్తడమే కాకుండా కొన్ని సార్లు రెటీనా దెబ్బదిని చూపు పూర్తిగా పోయే ప్రమాదం కూడా ఉంది. అంతేకాకుండా కాకుండా భుజాలు, మెడ, నడుము నొప్పులతోపాటు తలనొప్పి లాంటి సమస్యలు కూడా వస్తాయి. ఈ డిజిటల్‌ స్క్రీన్లను మనం ఎంతసేపు చూస్తామనేదాన్నిబట్టి సమస్యల తీవ్రత ఆధారపడి ఉంటుంది. రేటింగ్‌ ఏజెన్సీ ‘నీల్సన్‌’ నిర్వహించిన సర్వే ప్రకారం అమెరికాలో 18 ఏళ్ల ప్రాయం యువత రోజుకు 11 గంటలపాటు ఈ డిజిటల్‌ స్క్రీన్లకు అతుక్కుపోతున్నారు.

అందుకనే అక్కడి పిల్లలో సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. మెడ, భుజాలు, వెన్ను నొప్పి వచ్చిందన్న వారు 36 శాతం మంది, కంటీ సమస్యలు వచ్చిందన్నవారు 35 శాతం, తలనొప్పి వచ్చిందన్న వారు 25 శాతం మంది, 30 ఏళ్ల లోపువారిని పరిగణలోకి తీసుకుంటే వారిలో 73 శాతం మంది ఈ సమస్యలతో బాధ పడుతున్నారు. అంటే కొత్త జనరేషనే ఈ డిజిటల్‌ హై స్ట్రెయిన్‌తో ఎక్కువగా బాధ పడుతోందన్న మాట. ఆఫీసు వ్యవహారాలతోపాటు వ్యక్తిగత డాక్యుమెంట్లు, ఈమెయిళ్లు, ఫేస్‌బుక్‌ అప్‌డేట్స్, నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్‌ చూడడం ఈ తరం ప్రజల్లో ఎక్కువైన విషయం తెల్సిందే.

ఇప్పుడు మనం అఫీసుల్లో ఒకటి, రెండూ కంప్యూటింగ్‌ డివైస్‌లను ఉపయోగిస్తుంటేనే ఇన్ని సమస్యలు వస్తున్నాయి. 2020 నాటికి ప్రతి ఉద్యోగి సగటున ఆరు కంప్యూటింగ్‌ డివైస్‌లను ఉపయోగించాల్సి వస్తుందని ‘సిట్రిక్స్‌’ సంస్థ వెల్లడించింది.  మరి అప్పుడు పరిస్థితి మరెంత తీవ్రంగా ఉంటుందో. అన్నింటికన్నా కంటి సమస్యలను తీసుకొచ్చేది ఈ డిజిటల్‌ స్క్రీన్ల నుంచి వచ్చే కాంతి కిరణాలే. వాటిలో నీలి కాంతి కిరణాలు మరీ ప్రమాదకరం. కంటిలోని రెటీనాకూ నీలికాంతిని ఫిల్టర్‌ చేసే సామర్థ్యం లేకపోవడమే అందుకు కారణం. ఊదారంగు కాంతికన్నా కూడా ఈ కాంతి ప్రమాదకరమని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.

డిజిటల్‌ విప్లవం నుంచి మళ్లీ మనం ఎలాగూ వెనక్కి వెళ్లలేము గనుక తగిన జాగ్రత్తలు తీసుకోవడమే ఉత్తమమని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. డిజిటల్‌ స్క్రీన్ల నుంచి వెలువడే కాంతిని వీలైనంత మేరకు తగ్గించుకోవాలని, వాటిని వీలైనంత దూరంగా పెట్టి పనిచేసుకోవాలని, నీలిరంగు కాంతిని ఫిల్లర్‌ చేసే కళ్ల జోళ్లు వాడాలని వారు సూచిస్తున్నారు. కొన్ని టెక్‌ కంపెనీలు తమ ఉద్యోగులకు నీలిరంగు కాంతి కిరణాలను ఫిల్టర్‌చేసే కళ్ల జోళ్లను ఇప్పటికే సరఫరా చేస్తున్నాయి.

ఐ ఫోన్లలో రాత్రిపూట కాంతిని నియంత్రించే సౌకర్యం ఉంది. ఈ సౌకర్యం అన్ని ఫోన్లకు అందుబాటులోకి తెచ్చేందుకు యాప్స్‌ కూడా వస్తున్నాయి. ఈ దుష్ప్రభావం నుంచి తప్పించుకునేందుకు కంటి నిపుణులు ‘20–20–20’ ఫార్ములాను పాటించాలని సూచిస్తున్నారు. అంటే డిజిటల్‌ స్క్రీన్‌ చూస్తున్నప్పుడు ప్రతి 20 నిమిషాలకు ఒకసారి 20 సెకండ్ల పాటు 20 మీటర్ల దూరాన్ని చూడాలంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement