‘చైనా ఏంచేసినా ప్రతి అంగుళం భారత్‌దే’ | China has no right to rename Indian cities: venkaiah naidu | Sakshi
Sakshi News home page

‘చైనా ఏంచేసినా ప్రతి అంగుళం భారత్‌దే’

Apr 20 2017 7:20 PM | Updated on Sep 5 2017 9:16 AM

‘చైనా ఏంచేసినా ప్రతి అంగుళం భారత్‌దే’

‘చైనా ఏంచేసినా ప్రతి అంగుళం భారత్‌దే’

భారతదేశంలో అంతర్భాగమైన నగరాలకు తిరిగి పేర్లు పెట్టే హక్కు చైనాకు లేదని కేంద్రం స్పష్టం చేసింది. అరుణాచల్‌ ప్రదేశ్‌లో ప్రతి అంగుళం భారత్‌దేనని, అందులో వేలు పెడితే సహించేది లేదని తెలిపింది.

న్యూఢిల్లీ: భారతదేశంలో అంతర్భాగమైన నగరాలకు తిరిగి పేర్లు పెట్టే హక్కు చైనాకు లేదని కేంద్రం స్పష్టం చేసింది. అరుణాచల్‌ ప్రదేశ్‌లో ప్రతి అంగుళం భారత్‌దేనని, అందులో వేలు పెడితే సహించేది లేదని తెలిపింది. ఈ మేరకు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు గురువారం మీడియాతో మాట్లాడారు. ఇటీవల అరుణాచల్‌ ప్రదేశ్‌లో టిబెట్‌ ఆధ్మాత్మిక గురువు దలైలామా పర్యటించిన విషయం తెలిసిందే. దీనిని చైనా తీవ్రంగా వ్యతిరేకించింది.

దలైలామా పర్యటిస్తే భారత్‌తో తమ సంబంధాలు చెడిపోతాయని బెదిరించింది. అయినప్పటికీ భారత్‌ దలైలామా పర్యటనకు అనుమతించినందుకు ప్రతీకారంగా అరుణాచల్‌ ప్రదేశ్‌లోని ఆరు నగరాలను తమవే అని పేర్కొంటూ వాటికి ఆరు చైనా పేర్లు పెట్టి ప్రకటించింది. దీనిపై భారత్‌ ధీటుగా స్పందించింది. ‘అరుణాచల్‌ ప్రదేశ్‌లోని ప్రతి అంగుళం భారత్‌దే.. వారిని పేర్లు పెట్టుకుంటే పెట్టుకోని? అదేం పెద్ద విషయం కాదు. మీ పొరుగువాడికి వేరే పేరు పెట్టినంత మాత్రానా అతడి పేరు మారినట్లు కాదు కదా’ అని వెంకయ్య స్పందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement