మళ్లీ వెంకయ్యకే అవకాశం | chance again to venkaiah | Sakshi
Sakshi News home page

మళ్లీ వెంకయ్యకే అవకాశం

May 23 2016 12:35 AM | Updated on Mar 28 2019 8:37 PM

మళ్లీ వెంకయ్యకే అవకాశం - Sakshi

మళ్లీ వెంకయ్యకే అవకాశం

రాష్ట్ర శాసనసభల నుంచి రాజ్యసభకు జరిగే ఎన్నికల్లో కర్ణాటక నుంచి బీజేపీ అభ్యర్థిగా మరోసారి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పేరును కర్ణాటక బీజేపీ నాయకులు సిఫార్సు చేశారు.

రాజ్యసభ స్థానానికి సిఫార్సు చేసిన కర్ణాటక బీజేపీ

 సాక్షి, బెంగళూరు: రాష్ట్ర శాసనసభల నుంచి రాజ్యసభకు జరిగే ఎన్నికల్లో కర్ణాటక నుంచి బీజేపీ అభ్యర్థిగా మరోసారి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పేరును కర్ణాటక బీజేపీ నాయకులు సిఫార్సు చేశారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం బెంగళూరులో జరిగిన కోర్‌కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని పార్టీ పెద్దలకు తెలపనున్నారు. శాసనసభ నుంచి శాసనమండలిలోని ఏడు స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో ప్రస్తుత సంఖ్యాబలం ప్రకారం ఒక స్థానాన్ని బీజేపీ గెలుచుకోనుంది.

ఆ స్థానం కోసం మాజీ మంత్రి సోమణ్ణతోపాటు బీజేపీ బెంగళూరు నగర అధ్యక్షుడు సుబ్బనరసింహ పేర్లను కోర్‌కమిటీ సిఫార్సు చేసింది. ఇద్దరిలో ఒకరి పేరును పార్టీ పెద్దలు ఖరారు చేయనున్నారు. జేడీఎస్ సహాయంతో మరో ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకోవాలని కోర్ కమిటీలో తీర్మానించారు. ఈ రెండో స్థానం కోసం మాజీ మంత్రి కట్టా సుబ్రహ్మణ్యం నాయుడు పేరును సూచించే అవకాశం ఉందని సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement