అడ్డంగా బుక్కయిన ఐటీ అధికారి | CBI arrests income tax official for bribery | Sakshi
Sakshi News home page

అడ్డంగా బుక్కయిన ఐటీ అధికారి

Dec 11 2015 6:04 PM | Updated on Sep 3 2017 1:50 PM

5 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఆదాయపన్ను శాఖ ఉన్నతాధికారి అడ్డంగా బుక్కయ్యాడు.

ముంబై: పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటూ ఆదాయపన్ను శాఖ ఉన్నతాధికారి ఒకరు సీబీఐకి పట్టుబడ్డారు. ముంబైకి చెందిన ఐటీ అధికారి ఎం. జాగ్రన్ రూ. 5 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా సీబీఐకి దొరికారు. ముంబైలోని ఐటీ కార్యాలయంలో శుక్రవారం సీబీఐ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు.

సదరు ఆఫీసర్ పై అవినీతి ఆరోపణలు రావడంతో నిఘా పెట్టామని సీబీఐ అధికారులు తెలిపారు. పన్నుఎగవేసేందుకు గాను ఓ ప్రైవేటు కంపెనీ యజమాని నుంచి రూ. 5 లక్షలు డిమాండ్ చేశారనే సమాచారంతో దాడులు జరిపినట్టు వెల్లడించారు. త్వరలోనే  నిందితుడిని కోర్టులో ప్రవేశపెడతామన్నారు.

కాగా గతంలో ఇదే ఆఫీసులో రెండు లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఐటి కమీషనర్  దయా శంకర్ సీబీఐ అధికారులకు చిక్కారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement