రెండు రోజుల క్రితమే బ్యాంకులకు కొత్త కరెన్సీ | Arun Jaitley on currency revamp: This is a bold step in right direction | Sakshi
Sakshi News home page

రెండు రోజుల క్రితమే బ్యాంకులకు కొత్త కరెన్సీ

Nov 9 2016 2:29 PM | Updated on Apr 3 2019 5:16 PM

రెండు రోజుల క్రితమే బ్యాంకులకు కొత్త కరెన్సీ - Sakshi

రెండు రోజుల క్రితమే బ్యాంకులకు కొత్త కరెన్సీ

నల్లధనాన్ని అరికట్టడానికే పెద్ద నోట్ల రద్దు నిర్ణయమని...సామాన్యులను ఇబ్బంది పెట్టే ఉద్దేశం కేంద్రానికి లేదని ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ స్పష్టం చేశారు.

న్యూఢిల్లీ: నల్లధనాన్ని అరికట్టడానికే పెద్ద నోట్ల రద్దు నిర్ణయమని... సామాన్యులను ఇబ్బంది పెట్టే ఉద్దేశం కేంద్రానికి లేదని  ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ స్పష్టం చేశారు. ఎన్ని డబ్బులున్నా బ్యాంకుల్లో జమ చేసుకోవచ్చని..అయితే ఐడీ ప్రూఫ్‌ మాత్రం కచ్చితంగా చూపించాలని ఆయన బుధవారమిక్కడ పునరుద్ఘాటించారు. బ్లాక్‌మనీ ఉన్నవారే కేంద్రం ప్రతిపాదనకు కంగారు పడతారన్నారు. రెండురోజుల క్రితమే బ్యాంకులకు కొత్త కరెన్సీ వెళ్లిందని ఆయన పేర్కొన్నారు. అలాగే పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో పలు రంగాలు నష్టాల పాలవుతాయన్న వాదనను జైట్లీ కొట్టిపారేశారు. రియల్‌ ఎస్టేట్‌ ధరలు భారీగా తగ్గుతాయని ఆయన అన్నారు.

నిజాయితీగా సంపాదించిన డబ్బుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని జైట్లీ వ్యాఖ్యానించారు. అక్రమంగా డబ్బులు సంపాదించినవారికే అసలైన ఇబ్బంది ఉంటుందన్నారు. పెద్దనోట్ల రద్దు దీర్ఘకాలంలో మంచి ఫలితాన్ని ఇస్తుందని, నగదు లావాదేవీలను సాధ్యమైనంత తగ్గించేందుకు చర్యలు చేపట్టినట్లు జైట్లీ తెలిపారు. ఇబ్బందులన్నీ త్వరలో పరిష్కారం అవుతాయని ఆయన తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement