కార్గిల్ యుద్ద వీరులకు విక్రమ్ సింగ్ నివాళి | Army chief to pay tribute to Kargil war martyrs | Sakshi
Sakshi News home page

కార్గిల్ యుద్ద వీరులకు విక్రమ్ సింగ్ నివాళి

Jul 24 2014 9:54 AM | Updated on Sep 2 2017 10:49 AM

1999 కార్గిల్ యుద్ద వీరులకు ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ విక్రమ్ సింగ్ శుక్రవారం నివాళులర్పించనున్నారు.

జమ్మూ: 1999 కార్గిల్ యుద్ద వీరులకు ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ విక్రమ్ సింగ్ శుక్రవారం నివాళులర్పించనున్నారు. జూలై 31న రిటైర్ కాబోతున్న విక్రమ్ సింగ్ జమ్మూలోని ద్రాసా ప్రాంతాన్ని సందర్శించనున్నట్టు డిఫెన్స్ అధికారులు తెలిపారు. 
 
కేవలం ద్రాసాలోని విక్రమ్ సింగ్ పర్యటిస్తారని.. ఆ పర్యటన తర్వాత ఢిల్లీకి చేరుకుంటారని అధికారులు స్పష్టం చేశారు. 1999 నుంచి లడక్ ప్రాంతంలోని కార్గిల్ జిల్లాలోని జరిగిన పాకిస్థాన, భారత దేశాల మధ్య జరిగిన యుద్దంలో మరణించిన వీరులకు విజయ్ దివస్ పేరిట నివాళులర్పిస్తున్నామని అధికారులు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement