లాలూకు మరో షాక్‌.. కేసు నమోదు | another shock to lalu prasad yadav | Sakshi
Sakshi News home page

లాలూకు మరో షాక్‌.. కేసు నమోదు

Jul 27 2017 4:38 PM | Updated on Sep 27 2018 5:03 PM

లాలూకు మరో షాక్‌.. కేసు నమోదు - Sakshi

లాలూకు మరో షాక్‌.. కేసు నమోదు

ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌కు మరో షాక్‌ తగిలింది. ఇప్పటి వరకు ఆయన కుటుంబ సభ్యులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు తాజాగా లాలూపై కేసు నమోదు చేశారు.

న్యూఢిల్లీ: ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌కు మరో షాక్‌ తగిలింది. ఇప్పటి వరకు ఆయన కుటుంబ సభ్యులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు తాజాగా లాలూపై కేసు నమోదు చేశారు. రైల్వే హోటల్‌ అలాట్‌మెంట్‌లో ఆయన భారీ మొత్తంలో అవినీతికి పాల్పడ్డట్లు ఆరోపణలు నమోదు చేశారు.

మహాకూటమికి బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ గుడ్‌బై చెప్పేసిన గంటలు కూడా గడవక ముందే కేసు నమోదు కావడం గమనార్హం. నితీశ్‌ కుమార్‌ బిహార్‌ రాజకీయాలలో మరోసారి సంచలనం సృష్టించి మహాఘట్‌బంధన్‌ను వదిలి భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపిన విషయం తెలిసిందే. ఆరోసారి ముఖ్యమంత్రిగా గురువారంనాడు ప్రమాణం చేశారు. అవినీతిని తుదముట్టించేందుకు ఆయన ఎలాంటి నిర్ణయాలైన తీసుకుంటారని పేరుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement