ఎయిర్‌లిఫ్ట్‌ చేయాలని హైకోర్టు తీర్పు

Airlift 108-Foot Hanuman Statue And Relocate It, Say Judges In Delhi - Sakshi - Sakshi

న్యూఢిల్లీ : దేశ రాజధాని మధ్యలో ఉన్న 108 అడుగుల భారీ హనుమాన్‌ విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా విగ్రహాన్ని ఎయిర్‌లిఫ్ట్‌ చేయాలని తీర్పునిచ్చింది. హనుమాన్‌ ఉన్న ప్రాంతంలో ప్రదేశాలు దురాక్రమణకు గురయ్యాయనే ఓ నాన్‌ గవర్నమెంటల్ ఆర్గనేషన్‌(ఎన్‌జీవో) దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం హైకోర్టు విచారించింది.

ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. న్యూఢిల్లీలోని కరోల్‌ బాగ్‌ ప్రాంతంలో 108 అడుగుల హనుమాన్‌ విగ్రహం ఉంది. దీంతో అక్కడ భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. దేవుడిని ఆసరగా చేసుకుని ఆ ప్రాంతంలోని ప్రదేశాలపై కొందరు దురాక్రమణ జరిపారు. దీనిపై దాఖలైన పిటిషన్‌ను విన్న హైకోర్టు.. అమెరికా మాదిరి విగ్రహాన్ని ఎయిర్‌లిఫ్ట్‌ చేసి మరో చోట ప్రతిష్టించాలని తీర్పు చెప్పింది. ఇందుకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top