గాల్లో విమానం.. స్టీరింగ్ స్టక్! | Sakshi
Sakshi News home page

గాల్లో విమానం.. స్టీరింగ్ స్టక్!

Published Wed, Jun 22 2016 2:16 PM

air india flight steering stuck while in the air, landed safely

చెన్నై విమానాశ్రయంలో ఓ ఎయిరిండియా విమానానికి పెనుముప్పు త్రుటిలో తప్పింది. ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం ఏఐ 429 గాల్లో ఉండగానే దాని స్టీరింగ్ పనిచేయడం మానేసి, స్టక్ అయిపోయింది. ఆ సమయానికి విమానంలో 180 మంది ప్రయాణికులు ఉన్నారు. అంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు.

అయితే డ్రైవర్ అత్యంత జాగ్రత్తగా విమానాన్ని రన్వే మీద ల్యాండ్ చేశారు. దాంతో ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారు. దాదాపు అరగంట తర్వాత వేరే వాహనం సాయంతో విమానాన్ని బోర్డింగ్ పాయింట్ వద్దకు తీసుకెళ్లారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement