ఎంత మంది చచ్చారో లెక్కించలేదు : బీఎస్‌ ధనోవా | Air Chief BS Dhanoa Says Air Force Can Not Count How Many People Died Over Balakot Strike | Sakshi
Sakshi News home page

ఎంత మంది చచ్చారో లెక్కించలేదు : బీఎస్‌ ధనోవా

Mar 4 2019 1:25 PM | Updated on Mar 4 2019 6:20 PM

Air Chief BS Dhanoa Says Air Force Can Not Count How Many People Died Over Balakot Strike - Sakshi

దాడి చేయడమే మా పని. ఆ లెక్కలు ప్రభుత్వం

కోయంబత్తూరు : పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా భారత వాయుసేన మెరుపు దాడులు జరిపిన విషయం తెలిసిందే. అయితే సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భారత్‌లోని రాజకీయం ఈ సర్జికల్‌ స్ట్రయిక్స్‌ చుట్టే తిరుగుతోంది. ఈ దాడుల్లో ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారో లెక్క చెప్పాలని, వాటికి ఆధారాలు ఇవ్వాలని ప్రతిపక్షపార్టీలు ప్రశ్నిస్తుండగా..  250 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టామని అధికార పార్టీ పేర్కొంది. ఇక భారత వాయుసేన ఐఏఎఫ్‌ చీఫ్‌ బీఎస్‌ ధనోవా మాత్రం ఈ మెరుపు దాడుల్లో ఎంత మంది చచ్చారో లెక్కించలేదని తెలిపారు. భారత వాయుసేన ఆ పనిచేయలేదని పేర్కొన్నారు.

‘ఎంత మంది చనిపోయారనేది లెక్కించలేం. అది అక్కడ ఎంత మంది ఉన్నారనే సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. మృతుల సంఖ్యను లెక్కించడం భారత వాయుసేన పనికాదు. దాడి చేయడమే మా పని. ఆ లెక్కలు ప్రభుత్వం చూసుకుంటుంది. బాల్‌కోట్‌లోని ఉగ్రస్థావరాలను మాత్రం ధ్వంసం చేశాం.’ అని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 26న భారత వాయుసేన పాకిస్తాన్‌లోని బాలకోట్‌పై మెరుపు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement