2 లక్షల టాయిలెట్లు కట్టిస్తాం: ఆప్ | AAP promises 2 lakh toilets for women | Sakshi
Sakshi News home page

2 లక్షల టాయిలెట్లు కట్టిస్తాం: ఆప్

Nov 26 2014 8:14 PM | Updated on Apr 4 2018 7:42 PM

2 లక్షల టాయిలెట్లు కట్టిస్తాం: ఆప్ - Sakshi

2 లక్షల టాయిలెట్లు కట్టిస్తాం: ఆప్

మహిళల కోసం దేశ రాజధానిలో రెండు లక్షల పబ్లిక్ టాయిలెట్లు కట్టిస్తామని, రేప్ కేసుల విచారణకు వంద ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ హామీ ఇచ్చింది.

మహిళల కోసం దేశ రాజధానిలో రెండు లక్షల పబ్లిక్ టాయిలెట్లు కట్టిస్తామని, రేప్ కేసుల విచారణకు వంద ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ హామీ ఇచ్చింది. వాటితో పాటు.. నగరమంతా వై-ఫైతో కనెక్ట్ అయి ఉండే సీసీటీవీ కెమెరాలను కూడా పెట్టిస్తామంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రజలకు ఆమ్ ఆద్మీ పార్టీ ఈ హామీలు ప్రకటించింది. 'ఢిల్లీ డైలాగ్' పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ఈ విషయాలు తెలిపింది.

రాజధాని నగరం నడిబొడ్డునున్న తల్కతోరా గార్డెన్స్లో 500 మంది మహిళలతో నిర్వహించిన సదస్సులో ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ ఈ హామీలను గుప్పించారు. తమ ప్రాంతాలకు దగ్గర్లో ఏవైనా మద్యం దుకాణాలుంటే, వాటిని మూసేయాల్సిందిగా తీర్మానాలు చేయొచ్చని ఆయన మహిళలకు చెప్పారు. ప్రతి డీటీసీ బస్సులో ఈవ్ టీజింగ్ను అరికట్టడానికి ఓ మార్షల్ను పెడతామని కూడా అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement