Punjab ByPoll: తార్న్ తరణ్‌లో ఆప్‌ ముందంజ | AAP Leads in Tarn Taran Bypoll as Vote Counting Begins; Key Indicator for Punjab 2027 | Sakshi
Sakshi News home page

Punjab ByPoll: తార్న్ తరణ్‌లో ఆప్‌ ముందంజ

Nov 14 2025 1:09 PM | Updated on Nov 14 2025 1:26 PM

Punjab ByPoll AAP leading in Tarn Taran

అమృత్‌సర్: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశంలోని మరో ఎనిమిది నియోజక వర్గాలకు జరిగిన ఉప ఎన్నికలకు నేడు(శుక్రవారం) కౌంటింగ్‌ జరుగుతోంది. ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో పంజాబ్ సరిహద్దు జిల్లా తార్న్ తరణ్‌ ఉప ఎన్నికల ఫలితాల్లో ‘ఆప్‌’ ముందంజలో ఉంది.  

ఈ ఫలితాల తీర్పు పంజాబ్‌లో 2027లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు కీలక సూచికగా పరిగణిస్తున్నారు. తార్న్ తరణ్‌ ఉప ఎన్నికల్లో ప్రధాన పోటీదారులుగా ఆప్‌నకు చెందిన హర్మీత్ సింగ్ సంధు, బీజేపీకి చెందిన హర్జిత్ సింగ్ సంధు, ఎస్‌ఏడీకి చెందిన సుఖ్‌విందర్ కౌర్ రాంధావా, కాంగ్రెస్‌కు చెందిన కరణ్‌బీర్ సింగ్ బుర్జ్‌ నిలిచారు. వీరంతా ముమ్మర ప్రచారం నిర్వహించారు. ఆప్ ఎమ్మెల్యే డాక్టర్ కశ్మీర్ సింగ్ సోహల్ మృతితో ఈ స్థానంలో ఉప ఎన్నిక తప్పనిసరి అయింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement