సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం | Sakshi
Sakshi News home page

సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

Published Mon, Jun 11 2018 8:58 PM

62 People Blood Donation - Sakshi

రాయగడ: జిల్లా కేంద్రంలో సత్యసాయి సేవ సమితి ఉచిత రక్తదాన శిబిరం ఆదివారం నిర్వహించింది. ఈ సందర్భంగా సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్‌.వి.రమణమూర్తి మాట్లాడుతూ రాయగడ జిల్లా బ్లడ్‌బ్యాంక్‌ ఇన్‌చార్జి డాక్టర్‌ పి.కేశుబుద్ధి ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో 62 మంది సత్యసాయి భక్తులు పాల్గొని రక్తదానం చేశారని తెలిపారు. సుమారు 62 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు ఆయన తెలిపారు.

ఇంతవరకు సత్యసాయి ట్రస్ట్‌ ద్వారా నిత్యన్నదానం, వస్త్రదానం నిర్వహించామని, ఇప్పుడు రక్తదాన శిబిరం నిర్వహిస్తుండటం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఎస్‌.వి.రమణమూర్తితో పాటు సత్యసాయి సేవ సమితి కన్వీనర్‌ ఎస్‌.సోమేశ్వరరావు, డి.సత్యనారాయణ, బి.రామ్‌మోహనరావు, సతీష్, మహేష్, యూత్‌ సేవ సభ్యులు, మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement