సబర్మతీ నదిలో మునిగిపోయిన ఆరుగురు యువకులు | 6 Youths Drown In Sabarmati River In Gujarat | Sakshi
Sakshi News home page

సబర్మతీ నదిలో మునిగిపోయిన ఆరుగురు యువకులు

Aug 19 2016 9:56 AM | Updated on Nov 6 2018 4:57 PM

విహార యాత్ర వారిపాలిట మృత్యువుగా మారింది.

అహ్మదాబాద్: విహార యాత్ర వారిపాలిట మృత్యువుగా మారింది. శబర్కంత  జిల్లాలోని రస్లోడ్ గ్రామానికి చెందిన ఆరుగురు యువకులు సబర్మతీ నదీ తీరంలోని గల్టేశ్వర్ లో ఉన్నపురాతన శివాలయం దగ్గరికి విహారయాత్రకు గురువారం వెళ్లారు. అనంతరం స్నానం చేయడానికని నదిలోకి దిగి మునిగి పోయారని పోలీసు అధికారి తెలిపారు. స్థానిక మత్సకారుల సాయంతో శవాలను వెలికితీశారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం  ఆసుపత్రికి తరళించారు. ప్రమాదవశాత్తు మరణించినట్టుగా  కేసును నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement