'మక్కా మృతుల్లో 18 మంది భారతీయులు' | 18 Indians killed in Haj stampede, says Foreign Ministry | Sakshi
Sakshi News home page

'మక్కా మృతుల్లో 18 మంది భారతీయులు'

Sep 26 2015 6:09 AM | Updated on Jul 11 2019 8:48 PM

హజ్ యాత్ర సందర్భంగా సౌదీ అరేబియాలోని మినా నగరంలో గురువారం సంభవించిన తొక్కిసలాటలో 18 మంది భారతీయులు మరణించారని శనివారం ఉదయం భారత విదేశాంగ శాఖ వెల్లడించింది.

న్యూఢిల్లీ: హజ్ యాత్ర సందర్భంగా సౌదీ అరేబియాలోని మినా నగరంలో గురువారం సంభవించిన తొక్కిసలాటలో 18 మంది భారతీయులు మరణించారని శనివారం ఉదయం భారత విదేశాంగ శాఖ వెల్లడించింది.  ప్రస్తుతం ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో పాటు అమెరికా పర్యటనలో ఉన్న విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్.. ఎప్పటికప్పుడు సౌదీ పరిస్థితిని తెలుసుకుంటున్నారు.


సౌదీ అధికారులు పూర్తి వివరాలు ఇచ్చిన తర్వాతే భారతీయ మృతుల సంఖ్యను వెల్లడించారు. గురువారం నాటి తొక్కిసలాటలో మొత్తం 717 మంది మరణించిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement