సమాచారానికి 17% పెంపు | 17% fund raised for information | Sakshi
Sakshi News home page

సమాచారానికి 17% పెంపు

Mar 1 2015 2:06 AM | Updated on Sep 2 2017 10:05 PM

సమాచార, ప్రసార శాఖకు ఈసారి బడ్జెట్‌లో రూ. 3,711.11 కోట్లను కేటాయించారు. గతేడాది కేటాయించిన రూ. 3,176.80 కోట్లతో పోలిస్తే ఇది 17 శాతం ఎక్కువ.

న్యూఢిల్లీ: సమాచార, ప్రసార శాఖకు ఈసారి బడ్జెట్‌లో రూ. 3,711.11 కోట్లను కేటాయించారు. గతేడాది కేటాయించిన రూ. 3,176.80 కోట్లతో పోలిస్తే ఇది 17 శాతం ఎక్కువ. ఇందులో మెజారిటీ వాటా (రూ. 2,869.55 కోట్లు) ప్రభుత్వ బ్రాడ్‌కాస్టింగ్ సంస్థ ప్రసార భార తికి ప్రభుత్వ సహాయం కింద అందనుంది. అలాగే, త్వరలో ప్రారంభం కానున్న దూరదర్శన్‌కు చెందిన కిసాన్ చానల్‌కు రూ. 45 కోట్లు కేటాయించారు. ఎలక్ట్రానిక్ మీడియా పర్యవేక్షణ కేంద్రానికి రూ. 10.41 కోట్లు కేటాయించారు. ఈశాన్య రాష్ట్రాల కోసం అరుణాచల్ ప్రదేశ్‌లో సినిమా నిర్మాణం, యానిమేషన్, గేమింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు.

Advertisement
 
Advertisement
Advertisement