120 ఏళ్లలో అమరావతికి వరద ముప్పు లేదు | 120-year flood is not a threat to Amravati | Sakshi
Sakshi News home page

120 ఏళ్లలో అమరావతికి వరద ముప్పు లేదు

Apr 18 2017 1:35 AM | Updated on Aug 29 2018 9:29 PM

గడిచిన 120 ఏళ్ల చరిత్రలో అమరావతి ప్రాంతం కృష్ణా జలాలతో ముంపునకు గురైన దాఖలా లేదని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం

ఎన్జీటీలో రాష్ట్ర ప్రభుత్వ వాదన

సాక్షి, న్యూఢిల్లీ: గడిచిన 120 ఏళ్ల చరిత్రలో అమరావతి ప్రాంతం కృష్ణా జలాలతో ముంపునకు గురైన దాఖలా లేదని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జాతీయ హరిత ట్రిబ్యునల్‌ దృష్టికి తెచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి వరద ముప్పు ఉందని దాఖలైన పిటిషన్లపై విచారణను జాతీయ హరిత ట్రిబ్యునల్‌ సోమవారం చేపట్టింది.

ప్రతివాది అయిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరపున సీనియర్‌ న్యాయవాది ఎ.కె.గంగూలీ తన వాదనలు వినిపిస్తూ... .కృష్ణా నదీ జలాలతో అమరావతికి వరద ముప్పు ఉండదని పేర్కొన్నారు. తదుపరి వాదనలను మంగళవారం వింటామని చెబుతూ ధర్మాసనం విచారణను వాయిదావేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement