కోరాపుట్‌లో 12 మంది మావోల లొంగుబాటు | 12 Maoists surrender by Koraput | Sakshi
Sakshi News home page

కోరాపుట్‌లో 12 మంది మావోల లొంగుబాటు

Jun 9 2014 1:56 AM | Updated on Oct 9 2018 2:51 PM

జనజీవన స్రవంతిలో కలవాలనే ఆకాంక్షతో ఒడిశాలోని కోరాపుట్ జిల్లా పోలీసుల ఎదుట ఆదివారం 12 మంది మావోయిస్టులు లొంగిపోయారు.

కోరాపుట్ (ఒడిశా): జనజీవన స్రవంతిలో కలవాలనే ఆకాంక్షతో ఒడిశాలోని కోరాపుట్ జిల్లా పోలీసుల ఎదుట ఆదివారం 12 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరంతా ఆంధ్రా-ఒడిశా బోర్డర్ ప్రత్యేక జోనల్ కమిటీ ఆధ్వర్యంలోని శ్రీకాకుళం-కోరాపుట్ డివిజన్ కమిటీకి చెందిన వారని పోలీసులు తెలిపారు. లొంగిపోయిన వారు కోరాపుట్ జిల్లా నారాయణపట్న నివాసులని వెల్లడించారు.

వీరు గ్రామస్థాయిలో సమావేశాలు నిర్వహించడమే కాకుండా మావోలకు సమాచార వ్యవస్థను రూపొందించేవారని చెప్పారు. ఈ 12మందితో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకూ జిల్లాలో మొత్తం 33 మంది మావోలు లొంగిపోయారని పోలీసులు తెలిపారు. మావోయిస్టులందరూ హింసను విడనాడి జనజీవనస్రవంతిలో కలవాలని పోలీసులు పిలుపునిచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement