క్షమాపణ కోరడానికి చాలా పెద్ద కారణం కావాలి. నటి త్రిష తన అభిమానులను ఇలాంటి క్షమాపణే కోరారు. అయితే తను అంత పెద్ద తప్పు ఏం చేశారన్నదే ఆసక్తికరమైన అంశం. ఇంతకుముందు చక్కగా పుత్తడిబొమ్మలా ప్రేమకథా చిత్రాల్లో నటించి కమర్శియల్ చిత్రాల నాయకిగా ఎదుగుతూ వచ్చిన త్రిష ఆ మధ్య ప్రేమ,పెళ్లి అంటూ కాస్త హడావుడి చేసినా ప్రస్తుతం ఆ రెండింటికీ దూరంగా నటనపైనే దృష్టి సారిస్తున్న విషయం తెలిసిందే. అంతే కాదు నటిగా త్రిష తన బాణీని మార్చేశారు.ఇప్పుడు హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలకే ప్రాధాన్యత నిస్తున్నారు.అలా నటించిన తొలి చిత్రం నాయకి. తాజాగా మోహిని అనే చిత్రంలో నటిస్తున్నారు. విశేషం ఏమిటంటే ఈ రెండూ హారర్ కథా చిత్రాలే అన్నది గమనార్హం.
ద్విభాషా చిత్రంగా తరపైకి వచ్చిన నాయకి చిత్రం ముందు తెలుగులో విడుదలై ప్రేక్షకులకు నిరాశనే మిగిల్చింది. ఇక ఇటీవలే తమిళంలోనూ తెరపైకి వచ్చి అదే రిజల్ట్ను చవి చూసింది.ఇందుకు నటి త్రిష కూడా ఒక కారణం అనే అభిప్రాయం ప్రేక్షకుల నుంచి వస్తోంది.నాయకి చిత్రం ఎలాంటి ప్రచారం లేకుండా విడుదలైందనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. నటి త్రిష కూడా నాయకి చిత్రానికి ఎలాంటి ప్రచారం చేయలేదని ఆమె అభిమానులే ప్రశ్నిస్తున్నారు. దీనికి స్పందించిన త్రిష తన అభిమానులను క్షమించండి అని కోరుకున్నారు.
కారణం లేనిదే ఏ విషయం జరగదు. అందుకే నాయకి చిత్ర ప్రచార కార్యక్రమాలకు పూనుకోలేదు. ఆ వివరాలన్నీ తరువాత వెల్లడిస్తాను అని త్రిష తన ట్విట్టర్లో పేర్కొనడం చర్చనీయంశంగా మారింది. త్రిషకు ఆ చిత్ర నిర్మాత పారితోషికం పూర్తిగా చెల్లించలేదని, దాని గురించి అడిగిన్నప్పుడు తమిళ వెర్షన్ విడుదలైనప్పుడు మిగిలిన బ్యాలెన్స్ ఇస్తానని ఆ నిర్మాత చెప్పినట్లు మీడియాలో కథనాలు ప్రచారం అవుతున్నాయి. త్రిష నాయకి చిత్రం గురించి ఎక్కడా ప్రస్తావించక పోవడానికి ఇదే కారణమా? అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. ఇక అసలు కారణాలు ఏమిటన్నది ఈ చెన్నై చిన్నది నోరు విప్పితే కానీ తెలియదు.
ఐ యాం సారీ!
Published Thu, Sep 22 2016 1:48 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
Advertisement