ఏడ ఉన్నావే...

sri vishnu launches pataru palem prema katha song - Sakshi

శ్రీ మానస్, సమ్మోహన జంటగా తెరకెక్కిన చిత్రం ‘పటారుపాళెం ప్రేమ కథ’. జె.ఎస్‌ ఫిలిమ్స్‌ పతాకంపై దొరైరాజు వూపాటి స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. బాలు ధాకే స్వరపరచిన ఈ సినిమాలోని ‘ఏడ ఉన్నావే ఏడ ఉన్నావే..’ అనే తొలి పాటను హీరో శ్రీవిష్ణు విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘నన్ను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసింది దొరైరాజుగారే.

ఆయన దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పాటను విడుదల చేయడం సంతోషంగా ఉంది. పాట చాలా బాగుంది’’ అన్నారు. దొరైరాజు మాట్లాడుతూ– ‘‘పరువు హత్యల నేపథ్యంలో, కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీశాను’’ అన్నారు. ఈ సినిమాకు సంగీతం: బాలు ధాకే, సమర్పణ: జిఎస్‌ రెడ్డి, నిర్మాతలు: వి.లతా రెడ్డి, వి. సౌజన్యా దొరైరాజు, బి.ఆర్‌. బాలు, కె. రామకృష్ణ ప్రసాద్‌.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top