బాలీవుడ్ ప్రముఖులకు ముంబై పోలీసులు ఇస్తున్న సెక్యూరిటీ విషయంలో పోలీసు ఉన్నతాధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం ముంబైలో ఉన్న 40 మంది బాలీవుడ్ సినీ ప్రముఖుల్లో చాలామందికి సెక్యూరిటీ అవసరం లేనందున వారికి ప్రస్తుతం ఇస్తున్న సెక్యూరిటీని తొలగిస్తున్నట్టు ప్రకటించారు. కేవలం 15 మందికి మాత్రమే సెక్యూరిటీ ఇవ్వనున్నారు.
ఈ లిస్ట్లో బాలీవుడ్ టాప్ హీరోలు ఆమిర్ ఖాన్, షారూక్ ఖాన్ లాంటి వారు కూడా ఉన్నారు. 2013లో మైనేమ్ ఈజ్ ఖాన్ సినిమా విడుదల సమయంలో షారూఖ్ ఖాన్కు భద్రత పెంచారు. రెండు నెలల క్రితం మత అసహనంపై వ్యాఖ్యల సందర్భంగా అమీర్ ఖాన్ భద్రతను కూడా పటిష్టం చేశారు. అయితే ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగే అవకాశం లేకపోవడంతో ఈ ఇద్దరు టాప్ హీరోలకు ఇచ్చిన భద్రతను కుదించారు. ఇకపై ఆయుధాలు ధరించిన ఇద్దరు కానిస్టేబుళ్లు మాత్రమే వీరికి రక్షణ కల్పించనున్నారు. భారీ స్థాయిలో సిబ్బందిని సెలబ్రిటీల భద్రతకే కేటాయించటం వల్ల తమకు సిబ్బంది కొరత ఎదురవుతోందని భావించిన పోలీస్ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.
బాలీవుడ్ ప్రముఖులు విదు వినోద్ చోప్రా, రాజ్ కుమార్ హిరానీ, ఫరాఖాన్, కరీం మొరానీ లాంటి కొందరికి ఉన్న భద్రతను పూర్తిగా తొలగించగా అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్, దిలీప్ కుమార్, లతామంగేష్కర్ లాంటి ప్రముఖులకు గతం ఇచ్చినట్టుగానే భద్రతను కొనసాగించనున్నారు.
40 మంది బాలీవుడ్ సెలబ్రిటీలకు షాక్
Published Fri, Jan 8 2016 11:07 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ముద్దు పేర్ల యుద్ధం...పంజాబ్లో కొత్త పోకడ
- Lok Sabha Election 2024: బస్తీ మే సవాల్!
- ఎన్నికల వేళ పట్టుబడ్డ సొత్తు ఎంతంటే..
- బరువు తగ్గాలంటే.. మిల్లెట్స్తో హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ !
- 200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
- T20 WC: టీమిండియా ఆటగాళ్ల అమెరికా ప్రయాణం ఆరోజే!
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- మే 23 వరకు తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు
- మెగా‘ఆవేశం స్టార్’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ!
Advertisement